Thalliki Vandhanam: తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్తో అంతా పాయే..!
Wed Jun 18, 2025 14:26 Others
సమాజంలో రోజు రోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ఇప్పటికే విజయవాడ కమీషనరేట్ పరిధిలోని ప్రజలకు పలు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు .. దాంతో ఈ మధ్య నగరంలో సైబర్ నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
దాంతో సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య మాలు కొత్త పుంతలు తొక్కుతూ అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి ఫోన్ చేసి మీకు వివిధ పధకాల ద్వారా డబ్బులు పడేలాగా చేస్తాం అని మాయమాటల ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు… ఈ విధంగా తాజాగా నున్న పోలీసు స్టేషన్ పరిదిలో ఇద్దరు మహిళలకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మీకు తల్లికి వందనం పడలేదా మీ అక్కౌంట్ హోల్డ్ లో ఉంది అని చెప్పి వారి ద్వారా ఫోన్ నుండి పలు దఫాలుగా డబ్బులు వేరొక అక్కౌంట్ కు పంపించుకుని మోసం చేశారు…
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
అప్పటికే ప్రభుత్వ పథకం డబ్బులు కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లులు వారి ఉచ్చులో పడి వారి చెప్పినట్లుగా చేస్తూ వారికి తెలియకుండానే వారి ఖాతా నుండి డబ్బులు వారికి పంపేశారు ఎంతకీ డబ్బులు పడకపోగా ఉన్న డబ్బులు పోగా మోసపోయినట్లు గుర్తించి పోలీసులు ఆశ్రయించారు… దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. సైబర్ నరాల్లో చాలావరకు మోసాలు జరగడమే తప్ప డబ్బులు తిరిగి రావడం చాలా కష్టతరమవుతుందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ పథకాల సమయంలో సైబర్ నెరగాళ్లు వాటిని అడ్డుగా పెట్టుకుని ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని కాబట్టి వాటి పట్ల కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు… ప్రజలు చాలా అప్రమత్తంగా అనవసరంగా తెలియని వ్యక్తులకు ఫోన్ స్క్రీన్ షేరింగ్ చేయడం గాని, బ్యాంక్ వివరాలను గాని, ఓ.టి.పి.లను గాని చెప్పరాదని, వివిధ పధకాలకు డబ్బులు పడేలాగా చేస్తామని చెప్పి మీ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు నేరాలు చేస్తారని ప్రజలు ఇటువంటి నేరాలపై అవగాహన కలిగి ఉండి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
YS Jagan: వైసీపీలో హై టెన్షన్! జగన్ పల్నాడు పర్యటన వేళ..
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!
Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #ThallikiVandhanam #RespectMother #APGovernment #TributeToMother #VandanamScheme #EmotionalMoment #OneCallChangesAll #AndhraPradesh #WelfareScheme #MotherhoodRespect
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.